1, మే 2026, శుక్రవారం

ముగిసిన నరసింహుడు జయంతి ఉత్సవాలు

 యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్వహించిన నరసింహుడి జయంతి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈనెల 26న యాదగిరిగుట్టలో ,27న పాతగుట్టలో ప్రారంభమైన ఉత్సవాలకు మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం, నరసింహ జయంతి ,నరసింహ ఆవిర్భావ ఘట్టంతో అర్చకులు పరిసమాప్తి పలికారు. ఉదయం నిత్య పూజల అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత ప్రధాన ఆలయ ముఖమంటపంలో సహస్ర కలశాభిషేకాన్ని జరిపారు. సాయంత్రం ఆలయంలో నరసింహ జయంతి, స్వామి వారి ఆవిర్భావ కార్యక్రమాలు, నివేదన, తీర్థ ప్రసాద  కార్యక్రమాలను నిర్వహించారు. నరసింహుడు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 26 నుంచి నిలిపివేసిన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. 

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి