3, మే 2026, ఆదివారం

తొర్రూర్ లో బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట

 రేపటినుండి మే 14 వరకు గ్రామంలో ఉత్సవాలు ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ ను ఆహ్వానించిన కురుమ సంఘం. 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తొర్రూర్ గ్రామ బీరప్ప స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన నిర్వహణకు 50 వేల రూపాయలను ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి శనివారం కురుమ సంఘం పెద్దలకు అందజేశారు. ఈనెల నాలుగవ తేదీ నుంచి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో తొర్రూర్ గ్రామంలో పది రోజులు నిర్వహించే దైవ కార్యక్రమాలకు తొర్రూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో మర్రి నిరంజన్ రెడ్డి ని ఆహ్వానించారు. కార్యక్రమంలో కుల పెద్దలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకమ్ లక్ష్మి, జంగయ్య, లింగం ,శ్రీశైలం యాదగిరి ,రాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి