3, మే 2026, ఆదివారం

సంబురంగా రథోత్సవం

 మద్నూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల నుంచి కొనసాగుతున్న రథోత్సవం శనివారం రాత్రి ముగిసింది మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో రథ పౌర్ణమి సందర్భముగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు యువకులు గ్రామస్తులు లతాన్ని లాగుతూ లక్ష్మీ రమణ గోవిందా వెంకటరమణ గోవిందా అంటూ భక్తి పారవశ్యంలో మునిగారు రథోత్సవంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే టీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 



ఉత్కంఠ భరితంగా సాగిన కుస్తీ పోటీలు.. రథోత్సవం సందర్భముగా గోశాలలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్కంఠ గా సాగాయి .చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మల్ల యోధులు తరలివచ్చే కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఆడపిల్లలు సైతం కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. గెలిచిన వారికి మాజీ ఎమ్మెల్యే నగదు బహుమతిని అందించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి