3, మే 2026, ఆదివారం

ఆధ్యాత్మిక సమాచారం 3-5-2026

లింగంపేట మండలం ,నల్లమడుగు గ్రామంలో శనివారం పోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. రథాల పున్నమి సందర్భంగా ప్రతి ఏటా కుస్తీ పోటీలు పోచమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి వెండి కడియం వరకు కుస్తీ పోటీలు ఆద్యంతముత్కఠంగా సాగాయి. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు, చివరికి కుస్తీ వెండి కడెం బహుకరించినట్లు తెలిపారు సర్పంచ్ తహసీన్ బేగం తదితరులు పాల్గొన్నారు.

ముషీరాబాద్ లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం. 

ముషీరాబాద్ లో ప్రసిద్ధిగాంచిన మహంకాళి దేవాలయ ప్రధాన అర్చకులు వై చంద్రమౌళి ఆధ్వర్యంలో శనివారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు సుప్రియ నవీన్ గౌడ్ ఏ పావని వినయ్ కుమార్ గౌరీ శంకర్ ఆలయ కమిటీ చైర్మన్ పి శ్రీధర్ చారి తదితరులు హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పూజ నిర్వహించి కానుకలు సమర్పించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో స్థానికంగా ఆధ్యాత్మికత వెళ్లి విరిసింది.

700 ఏళ్లుగా కొండెక్కని దీపం

 గంభీరావు పేట లోని సీతారామ సమి గుడిలో అఖండ నందదీపం.



పై చిత్రంలోని దీపం సాధారణమైనది కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం లోని అఖండ నందా దీపం ఇది. ఈ దీపం ఏకంగా 700 ఏళ్లుగా కొండేక్కలేదు అంటే ఆరిపోలేదు. అవును నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడం విశేషం. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వికులు చెబుతుంటారు. ఆలయంలో మూల విగ్రహ ప్రతిష్టకు ముందు ఈ అఖండనందా దీపాన్ని వెలిగించారు. నాటి నుంచి నేటి వరకు ఆ దీపం కొండెక్కకుండా ఆలయ నిర్వాహకులు, భక్తులు తరతరాలుగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అఖండ జ్యోతి వెలిగితేనే తమ గ్రామం సిరి సంపదలతో తుల తూగుతుందని గంభీరావుపేట ప్రజల విశ్వాసం. ఈ సీతారామాలయం 1333వ సంవత్సరంలో నిర్మించినట్లు ఆలయంలోని గంటపై చెక్కిన తెలుగు అంకెల ఆధారంగా తెలుస్తోంది .ఇక ఆలయంలో 16 స్తంభాలతో నిర్మించిన కళ్యాణ మండపం /రాతి నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఏటా శ్రీరామనవమి సందర్భముగా ఈ మండపంలోనే సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకను, అఖండ దీపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.