3, మే 2026, ఆదివారం

సంబురంగా రథోత్సవం

 మద్నూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల నుంచి కొనసాగుతున్న రథోత్సవం శనివారం రాత్రి ముగిసింది మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయంలో రథ పౌర్ణమి సందర్భముగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు యువకులు గ్రామస్తులు లతాన్ని లాగుతూ లక్ష్మీ రమణ గోవిందా వెంకటరమణ గోవిందా అంటూ భక్తి పారవశ్యంలో మునిగారు రథోత్సవంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే టీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 



ఉత్కంఠ భరితంగా సాగిన కుస్తీ పోటీలు.. రథోత్సవం సందర్భముగా గోశాలలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్కంఠ గా సాగాయి .చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మల్ల యోధులు తరలివచ్చే కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఆడపిల్లలు సైతం కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. గెలిచిన వారికి మాజీ ఎమ్మెల్యే నగదు బహుమతిని అందించారు.

పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి రెండు లక్షల విరాళం

 రామారెడ్డి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి రెండు లక్షల రూపాయలను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడటంతో ఎమ్మెల్యేను కలిసి వివరించగానే తక్షణమే స్పందించి రెండు లక్షల రూపాయలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. మున్ముందు ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏఎంసి డైరెక్టర్ రావు ఫ్, బాలయ్య ,డైరెక్టర్ రాజు ,నాయకులు గురజాకుంట స్వామి ,అమ్ముల పశుపతి, రామాలయం చైర్మన్ పశుపతి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోపి, రామ్మూర్తి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.