వివేకానంద యుక్త వయసులో ఉండగా తండ్రి విశ్వనాథ దత్త హఠాత్తుగా కన్నుమూశారు ఒక్కసారిగా కుటుంబం పేదరికంలో కురుకుపోయింది పెద్ద కుమారుడైన వివేకానందుడే ఆధారమయ్యాడు పట్టభద్రుడైన ఆయనకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు అలాంటి క్లిష్ట పరిస్థితులలో గురువు పరమహంస వద్దకు వెళ్లి బాధపంచుకున్నాడు అప్పుడు ఆయన సమీపానే ఉన్న దక్షిణేశ్వర కాళి ఆలయం వైపు చూపిస్తూ ఇవాళ మంగళవారం ఈరోజున అమ్మవారిని ఏది కొడితే అది అనుగ్రహిస్తుంది వెళ్లి ప్రార్థించు అన్నాడు ఆ సాయంత్రం వివేకానంద మందిరానికి వెళ్లి అమ్మను ప్రార్థించారు తిరిగి వచ్చాక రామకృష్ణుడు అమ్మ ఏమన్నది అని అడిగారు అరే అడగటం మర్చిపోయాను అని వివేకానంద మదనపడ్డారు. సరే మళ్ళీ వెళ్ళు అన్నారు పరమహంస ఈసారి అదే పద్ధతి మూడోసారి స్వామీజీ ఖాళీ ఆలయానికి వెళ్లి వచ్చాక ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపించారు పరమహంసను ఉద్దేశించి జగన్ మాతను డబ్బు కావాలని ఎలా అడగగలను? అలా చేస్తే మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది నిస్వార్ధ ప్రేమతో భక్తితో అమ్మను అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని ప్రార్థించాను అన్నారు వివేకానంద కానీ అమ్మవారి కృప గురువుగారి ఆశీస్సులు ఫలంగా అప్పటినుంచి వివేకానంద కుటుంబానికి ఎలాంటి లోటు రాలేదు అవసరమైన వసతులకు ఇబ్బంది కలగలేదు
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
29, ఫిబ్రవరి 2024, గురువారం
నేరుగా ఇంటికి అయోధ్య హనుమాన్ ప్రసాదము
అయోధ్యలో ఉన్న హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్ళకు చేరనున్నది బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది దీంతో చాలామంది భక్తులకు హనుమాన్ గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అయోధ్య ఖాన్ 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడ్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికి పంపుతామని ప్రయోగరాజ్ వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయల మనీ ఆర్డర్ కు లడ్డూలు, హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు