తిరుమలేష్ ని సర్వదర్శనానికి శుక్రవారం భక్తుల రద్దీ పెరిగినది. శుక్రవారం సాయంత్రానికి టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగరి షెడ్లు నిండిపోయాయి .దీనితో స్వామివారి దర్శనానికి 14 గంటలు పట్టనున్నది. విఐపి బ్రేక్ దర్శనాలు, తిరుపతిలో స్లాటేడ్ సర్వదర్శనాలు ,టోకెన్లు రద్దుచేసి తిరుమలలోని సర్వదర్శనానికి అనుమతించడంపై ఈనెల 6న ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
2, మే 2026, శనివారం
యాదగిరిగుట్టలో నిత్యం గిరి ప్రదక్షిణ
ఇకపై యాదగిరిగుట్టలో ప్రతిరోజు గిరిప్రదక్షిణ నిర్వహణకు కొండ క్రింద వైకుంఠ ద్వారం దగ్గర కృష్ణ శిలతో తయారుచేసిన స్వామి వారి పాదాలు ప్రతిష్టించి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించ, ఆలయ ఈవో భవాని శంకర్తో కలిసి ప్రారంభించారు. రోజు ఉదయం 5:30 కు ప్రత్యేక పూజలు అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుందని భక్తులు ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు స్వామి వారి జన్మ నక్షత్రమైన "స్వాతి "రోజున మాత్రమే గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

