3, మే 2026, ఆదివారం

తొర్రూర్ లో బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట

 రేపటినుండి మే 14 వరకు గ్రామంలో ఉత్సవాలు ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ ను ఆహ్వానించిన కురుమ సంఘం. 

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తొర్రూర్ గ్రామ బీరప్ప స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన నిర్వహణకు 50 వేల రూపాయలను ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి శనివారం కురుమ సంఘం పెద్దలకు అందజేశారు. ఈనెల నాలుగవ తేదీ నుంచి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో తొర్రూర్ గ్రామంలో పది రోజులు నిర్వహించే దైవ కార్యక్రమాలకు తొర్రూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో మర్రి నిరంజన్ రెడ్డి ని ఆహ్వానించారు. కార్యక్రమంలో కుల పెద్దలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేకమ్ లక్ష్మి, జంగయ్య, లింగం ,శ్రీశైలం యాదగిరి ,రాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.



యాదగిరిగుట్టలో నిత్య కళ్యాణం

 యాదగిరిగుట్ట దేవస్థానంలో శనివారం నిత్య పూజల వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూవలను మేల్కొల్పిన అర్చకులు సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసి దళాలను అర్పించారు . ప్రాకార మంటపంలో నరసింహ హోమం, నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని తిరవీధులలో ఊరేగించారు. కొండపైన అనుబంధ ఆలయం అయిన శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో ప్రతినిత్యం స్పటిక లింగ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈనెల ఐదున మంగళవారం రోజున హుండీ లెక్కింపు కొండ కింద వ్రతమంటపం హాల్ నెంబర్ 2 లో జరుగుతుందని ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వివిధ శాఖల నుంచి నిత్య ఆదాయంగా 40 లక్షల 25 వేల 26 రూపాయలు వచ్చినట్లు తెలిపారు.