కర్ణాటకలోని కొప్పల జిల్లా కిష్కింద గ్రామ పరిధిలోని అంజనాద్రిపై కొలువైన అంజన్నకు హైదరాబాద్ కు చెందిన ఏఎంఆర్ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఏ మహేష్ రెడ్డి 2:30 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహుకరించారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి మెట్ల దారిలో బంగారు గద, మకర తోరణం, చత్రం, కిరీటాలను కొండపైకి తీసుకెళ్లి దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం ఆలయంలో విశేష పూజలు చేసి స్వామి వారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి లక్ష్మీ అరుణ సమక్షంలో ఈ ఆభరణాలను అప్పగించారు. గంగావతి తహసిల్దార్ వసంతకుమారి, కనకగిరి తహసిల్దార్ విశ్వనాథ్ మురడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
9, మే 2026, శనివారం
8, మే 2026, శుక్రవారం
ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోడూరు హనుమాన్ ఆలయంలో గురువారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు నారాయణ శర్మ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ జలాధివాసం భజ సంస్కారం నిర్వహించడంతోపాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

