9, మే 2026, శనివారం

గంగమ్మ దేవి నూతన ఆలయ ప్రాణప్రతిష్ట

 



రామారెడ్డి మండల కేంద్రంలో గంగపుత్రుల కులదైవం శ్రీ గంగాభవాని దేవి గుడి నిర్మాణం భారీ దేయంతో నిర్మించడం జరిగింది. నూతన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర గణపతి సుబ్రహ్మణ్య నందీశ్వర మరియు అద్భుతమైనటువంటి 62 అడుగుల ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం వేద పండితుల మంథోత్సవాల మధ్య ఘనంగా శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు నెమలి నాగరాజు శర్మ వల్లంపట్ట నాగరాజు సహాయ పండితులు గణపతి పూజతో ప్రారంభించి పుణ్యాహవాచనం మూలమంత్ర హోమాలు యంత్ర ప్రతిష్ట పూర్ణాహుతి కుంబాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నుల పండుగ శివ కళ్యాణ మహోత్సవం వీక్షించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ పిలుపుమేరకు మండల అభివృద్ధి అధికారి నాగేశ్వర్ గుప్తా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికాంత్ పాల్గొన్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం అధ్యక్షులు నామాల లింబాద్రి సెక్రటరీ నూతన ఆలయ నిర్మాణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నామాల రవి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు మరియు గ్రామస్తులకు అధికారులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం రోజున సాయంత్రం మూడు గంటల నుండి గంగాభవాని దేవికి బోనాలను సమర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించి మరుసటి రోజు ఆదివారం ఇళ్ళకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు కావున బోనాల ఉత్సవాల ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొని గంగాభవాని తల్లి ఆశీస్సులు పొందాలని కోరారు ఇట్టి కార్యక్రమానికి సహకారం అందించిన గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ పాలకవర్గ సభ్యులకు గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అంజనాద్రి అంజన్నకు రెండున్నర కోట్ల బంగారు ఆభరణాలు

 కర్ణాటకలోని కొప్పల జిల్లా కిష్కింద గ్రామ పరిధిలోని అంజనాద్రిపై కొలువైన అంజన్నకు హైదరాబాద్ కు చెందిన ఏఎంఆర్ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఏ మహేష్ రెడ్డి 2:30 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహుకరించారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి మెట్ల దారిలో బంగారు గద, మకర తోరణం, చత్రం, కిరీటాలను కొండపైకి తీసుకెళ్లి దేవాదాయ శాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం ఆలయంలో విశేష పూజలు చేసి స్వామి వారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి లక్ష్మీ అరుణ సమక్షంలో ఈ ఆభరణాలను అప్పగించారు. గంగావతి తహసిల్దార్ వసంతకుమారి, కనకగిరి తహసిల్దార్ విశ్వనాథ్ మురడి కార్యక్రమంలో పాల్గొన్నారు.