27, మార్చి 2024, బుధవారం

వైభవంగా లక్ష్మీ నరసింహుడి దక్షిణ దిగ్ యాత్ర

 జగిత్యాల జిల్లా ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం దక్షిణ దిగ్ యాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సంప్రదాయం ప్రకారం ఆలయానికి దక్షిణ దిశలో ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో పూజలు నిర్వహించారు


జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మంగళవారం అక్కడి పోలీస్ స్టేషన్ను సందర్శించారు స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్నారు స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్య ఘట్టమైన నరసింహుడి దక్షిణ దిగ్ యాత్రను మంగళవారం అంగరంగ వైభవంగా జరిపించారు ఇందులో భాగంగా ధర్మపురి పోలీస్స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఉదయ్ కుమార్ నేతృత్వంలో అర్చకుల వేద మంత్రచారణల మధ్య ప్రత్యేక పూజలు జరిపించారు ఆలయం నుంచి శోభాయాత్రగా తరలి వెళ్లిన స్వామివారికి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక పూజలు జరిపారు స్వామి వారి కళ్యాణ అనంతరం దక్షిణ ఉత్తరలుగా బయలుదేరుతుంటారని మార్గమధ్యంలో ఉన్న పోలీస్ స్టేషన్ను లక్ష్మీనరసింహుడు సందర్శించి రికార్డులు రిజిస్టర్లను పరిశీలించి దుష్టులను శిక్షిస్తాడని ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అని పండితులు తెలిపారు



తెలంగాణ తిరుమలలో రథోత్సవం

 తెలంగాణ తిరుమల దేవస్థానంలో సోమవారం పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు స్వామివారికి అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని మాడవీధులు ఊరేగించారు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు అప్పారావు నరసరాజు రాజు హనుమంతరావు మేనేజర్ విట్టల్ తదితరులు ఉన్నారు



శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

 వాహన సేవలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ దంపతులు

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మల్లప్ప స్వామి వారు గరుడ వాహనంపై ఆలయం మాడవీధుల్లో వివా విహరించి భక్తులను కటాక్షించారు గరుడ వాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్ట్ ఎన్వి రమణ శివమాల దంపతులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు కార్యక్రమంలో శ్రీ చిన్న జీయర్ టీటీడీ న్యాయాధికారి వై వీర్రాజు జిల్లా ప్రోటోకాల్ న్యాయమూర్తి ఎం గురునాథ్ ప్రోటోకాల్ మున్సిపన్ న్యాయమూర్తి పి కోటేశ్వరరావు శ్రీవారి  ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు




26, మార్చి 2024, మంగళవారం

ధర్మపురిలో వైభవంగా తెప్పోత్సవం

  జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ పుష్కరిణిలో సోమవారం సాయంత్రం ఉగ్ర నరసింహుడి తెప్పోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా ఆరో రోజున ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిని వరకు మంగళ వాయిద్యాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అనంతరం భోగమండపంలోని కూయలపై స్వామివార్లకు డోలోత్సవం నిర్వహించారు ఈ వేడుకలు ఆచార్యులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు




యాదాద్రిలో హోలీ సేవా

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హోలీ పండుగ సందర్భంగా ఆచార్యులు విశేష పూజలను నిర్వహించారు సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయ తిరుమల వీధుల్లో ఊరేగించారు అనంతరం పడమటి రాజగోపురం ముందు గల వేంచేపు మండపంలో అధిష్టించే ప్రత్యేక పూజలు చేసి వేద పారాయణం చేశారు ఆలయ ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు హోలీ వేడుక విశేషాన్ని భక్తులకు వివరించారు పూజల తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులపై రంగులు చెల్లి ఆ తర్వాత భక్తులపై చెల్లారు ఈ వేడుకలు ఆలయ ఆచార్యులు అధికారులు భక్తులు పాల్గొన్నారు



రామయ్య పెళ్లి కొడుకు కాయని

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పెళ్లి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు వేద పండితుల సతీమణులతో పాటు ఇవు రమాదేవి పసుపు కుంకు కొమ్ములు దంచే కార్యక్రమంతో పనులకు శ్రీకారం చుట్టారు ప్రతి ఏడాది పాల్గొన పౌర్ణమి రోజున ఈ వేడుకలు ప్రారంభించడం మానవాహితీ ముందుగా మేళా తాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూరలను ఉత్తర ద్వారం వద్దకు తీసుకువచ్చి ఆశీర్వది చేశారు ఆ తర్వాత ఆలయంలో వైభవంగా వసంతోత్సవం డోలోత్సవం నిర్వహించారు ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే జగత్ కళ్యాణం పనులను పాల్గొన పౌర్ణమి సందర్భంగా సోమవారం ఘనంగా ఆరంభించారు ఉత్తర ద్వారం వద్ద స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు రోకలికి దేవతలను అవగాహన చేసి పసుపు కొమ్ములు దంచారు మిథిలా మండపం వద్ద ఉంచిన బియ్యాన్ని తలంబ్రాలుగా సిద్ధం చేశారు కుంకుమ పసుపు సెంటు రోజు వాటర్ ను నేను ఈ కలిపి రామయ్య అక్షతలకు పరిమళాలను జోడించారు ఈ క్రతువులు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం బేడ మండపం వద్ద స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు



ఊరంతా గుద్దుకున్నారు

 హోలీ వేల రంగులు చల్లుకోవడం సహజం కానీ నిజామాబాద్ జిల్లా హుంసా గ్రామంలో పిడుగులాట ఆడుతారు సోమవారం ఒకరినొకరు పిడికిలి బిగించి కొట్టుకున్న జనం తర్వాత ఆ లింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు


హోలీ పండుగ వేళ ఆనవాయితీ రెండు గ్రూపులుగా విడిపోయి బాదుకున్న హునసా గ్రామస్తులు

హోలీ పండుగ వేళ హున్స గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి పిడుగులు ఆడుకున్నారు 130 ఏళ్ల నుంచి మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హుంసా గ్రామంలో ఇది ఆనవైదిగా కొనసాగుతోంది గ్రామం సుభిక్షంగా ఉండాలంటే మా పూర్వీకుల నుంచి దీనిని జరుపుకుంటున్నామని గ్రామ పెద్దలు తెలిపారు గ్రామం మధ్యలోని హనుమాన్ మందిరం ఎదుట సోమవారం వేదిక ఏర్పాటు చేశారు నాలుగైదు ఫీట్ల ఎత్తైన కర్ర స్తంభాలు పాటి మధ్యలో పొడవును గట్టి తాడు కట్టారు సాయంత్రం గ్రామ శివారులో కుస్తీ పోటీలు ముగించుకొని ఈ ఆటకు సిద్ధమయ్యారు గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి పిడుగులు అట ప్రారంభించారు సాయంత్రం 62 నిమిషముల నుంచి 15 నిమిషాల పాటు ఆట కొనసాగింది గ్రామ పెద్దల సూచన మేరకు ఆటను విరమించారు తదనంతరం ఇరుపక్షాల వారు ఆ లింగనం చేసుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు బోధన్ ఎసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు

మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని కొంతనపల్లిలో సోమవారం హోలీ సంబరాలు ప్రత్యేకంగా జరుపుకున్నారు గ్రామంలోని ప్రధాన కూడలి వద్దకు గ్రామస్తులు చేరుకొని రెండు గ్రూపులుగా విడిపోయి తాడు కట్టిలాగా అనంతరం పరస్పరం పిడుగులు గుద్దుకున్నారు చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు



25, మార్చి 2024, సోమవారం

శివ కళ్యాణానికి రాజన్న ఆలయం ముస్తాబు

 27 నుంచి 31 వరకు జరగనున్న ఉత్సవాలు 28న కళ్యాణము

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 27న శివకళ్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి 31 వరకు ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే యాగశాలను సిద్ధం చేశారు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుండగా వేములవాడ మాత్రం శివ మహాపురాణం ఆధారంగా కామ దహనం తర్వాత కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈనెల 28న అభిషేక లగ్న ముహూర్తాన ఉదయం 10:50 నుంచి 125 నిమిషముల వరకు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు కల్యాణం సందర్భంగా రాజన్న ఆలయం మున్సిపాలిటీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ముప్పయిన స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలను వీక్షి ంచేందుకు లక్షలాదిమంది భక్తులతో పాటు జోగినిలు హాజరవుతారు ఒకవైపు శివుడి వివాహం జరుగుతుండగా జోగినులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని శివుడిని పెళ్లాడినట్లు తన్మయత్వం చెందుతారు ఐదు రోజులపాటు అభిషేకాలు పూజలు రద్దు శివ కళ్యాణం సందర్భంగా ఈనెల 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు ఆలయంలో నిత్య కళ్యాణం సత్యనారాయణ వ్రతం లింగార్చన అభిషేకం రద్దు చేయనున్నారు అలాగే కళ్యాణం రోజు చండీ సహిత రుద్ర హోమం టికెట్స్ భక్తులు సమర్పించే కోడెల టికెట్స్ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అని ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు



కనుల పండుగగా నరసింహుడు తెప్పోత్సవం

 



జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం సాయంత్రం బ్రహ్మ పుష్కరిణి కోనేరులో తెప్పోత్సవాన్ని కనుల పండుగ జరిపించారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిణి వరకు మేళ తాళాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై ఐదు ప్రదక్షిణలు చేయించారు అనంతరం భోగమండపంలోని ఊయలపై స్వామివారిలను ఆసీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది వరకు భక్తులు తరలివచ్చారు కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ ప్రభుత్వ విప్లరి లక్ష్మణ్ కుమార్ డిసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు



హ్యాపీ హోలీ 2024

 హోలీ పర్వదినం సందర్భంగా ఒడిశాలోని పూరి బీచ్ లో సుదర్శన్ పట్నాయక్ వేసిన సైకత శిల్పం



ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

 ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మండల కేంద్రమైన కుంటాలలోని శ్రీకృష్ణ ప్రాచీన దేవాలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా హరి ఓం సత్సంగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మహారాష్ట్రలోని చిక్కిలి గ్రామానికి చెందిన రెడ్డి మహారాజ్ భక్తుల గోపాలు ప్రవచనాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు



అంజన్న స్వాముల సన్నిధానానికి కూలర్లు అందజేత

 కుంటాల మండల కేంద్రమైన కుంటాలలోని అంజన్న స్వాములకు సన్నిధానంలో నందిపేట మండలంలోని జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నందగిరి అన్వేష్ కుమార్ అంజన్న భక్తులకు రెండు కూలర్లను విరాళంగా తన వంతుగా సహాయంగా అందజేశారు అంతేకాకుండా అంజన్న భక్తులకు బిక్షం ఏర్పాటు చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా గురుస్వామి భుజంగం గణపతి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంజన్న స్వాములు గ్రామస్తులు పాల్గొన్నార



రంగులు మెరిసే నవ్వులు విరిసే

 


దేశవ్యాప్తంగా ఒకరోజు ముందే హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి ఆదివారం పశ్చిమ బెంగాల్లోని బాలుర్ ఘాట్ లో యువతులు ఇలా ఉత్సాహంగా రంగులు చ ల్కున్నారు



శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ

 శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు

భక్తులతో కిటకిటలాడిన యాదగిరి క్షేత్రం

 



యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడు చిత్రంలో ఆదివారం భక్తుల కులాహారం నెలకొంది వారాంతపు సిలవ రోజు కావడంతో ఇష్టదైవం దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ప్రత్యేక ధర్మదర్శన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి ఉచిత దర్శనం దర్శనానికి మూడు గంటలు వీఐపీ టికెట్ దర్శనానికి గంట సమయం పట్టింది క్యూ కాంప్లెక్స్ లోని ఏసీలు పనిచేయకపోవడంతో ఒక్క పూసలతో భక్తులు ఇబ్బందులు పడ్డారు 30 వేల మంది భక్తులు లక్ష్మీనరసింహుడిని దర్శించుకోగా వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు 55 లక్షల 3896 రూపాయలు ఆదాయం సమకూరిందని ఈవో ఏ భాస్కరరావు తెలిపారు ఎండలు మండుతుండడంతో కొండపై భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఉపశమనం కోసం అధికారులు చలువ పందిళ్ళను ఏర్పాటు చేస్తున్నార




భద్రాద్రి లో నేడు డోలోత్సవం వసంతోత్సవం

 భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం దోలోచవం వసంతోత్సవం నిర్వహించనున్నారు ఆదివారం గోదావరి నుంచి తీర్థ బిందెను తీసుకొచ్చి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి డోలోత్సవం వసంతోత్సవాలకు అంకురార్పణ చేశారు డోలోత్సవం వసంతోత్సవం నిర్వహించే సోమవారం నిత్య కళ్యాణాన్ని నిలిపివేయనున్నారు దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుంచి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఏప్రిల్ 17న స్వామివారికి కల్యాణం నిర్వహించనున్నారు కాదా శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి వినియోగించే తలంబ్రాలు తయారీకి సోమవారం శ్రీకారం చుట్టం అన్నారు దేవస్థానం వైదిక సిబ్బంది వారి సతీమణులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను అన్నారు గత ఏడాది 250 కుంటాల తలంబ్రాలు సిద్ధం చేయగా ఈసారి 300 కుంటల తలంబ్రాలను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇదిలా ఉండగా భద్రాద్రి రామయ్య కళ్యాణం సందర్భంగా తలంబ్రాల తయారీ కోసం జంగారెడ్డిగూడెం శ్రీరామ ఆధ్యాత్మిక సేవాసమితి భక్త బృందం 128 క్వింటాళ్ల బియ్యాన్ని భద్రాచలం కు తీసుకొచ్చింది ఈ బియ్యాన్ని దేవస్థానం అధికారులకు అందజేసింది

దగడు సేటు వినాయకుడి కి ద్రాక్ష మహోత్సవం

 



హోలీ సంబరాల వేళ మహారాష్ట్రలో విఘ్నేశ్వరాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పూణేలో కొలువైన దగడు సేట్ వినాయక ఆలయాన్ని రంగురంగుల ద్రాక్ష పండ్లతో ముస్తాబు చేశారు ఇందుకోసం దాదాపు 2000 కిలోల ద్రాక్ష పనులను వినియోగించారు ఆలయ ప్రాంగణాన్ని నలుపు ఆకుపచ్చ ద్రాక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవము వేడుకగా జరుపుకోవాలని ఇక్కడ ఆనవాయితీ సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన అద్భుతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామి వారి వద్ద ఉంచిన ద్రాక్ష పనులను ససూన్ ఆసుపత్రి పితాశ్రీ వృద్ధాశ్రమం తో పాటు పలు సంస్థలకు భక్తులకు పంపిణీ చేస్తారు.



రాజాం రచయితల వేదిక 110వ సమావేశం

 ఈనెల మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో రాజాం రచయితల వేదిక ఒక వంద పది వ సమావేశం జరుగుతుంది రాజాకు శాంతారావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వేమన ప్రగతి శీలత అనే అంశంపై బొంతు సూర్యనారాయణ ప్రవాహి ముఖ్య ప్రసంగం చేస్తారు

గారా రంగనాథం 9885758123

ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

 తిరుమలలో ఐదు రోజులపాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి చివరి రోజు రాత్రి శ్రీ మల్లప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను నాలుగు మాడవీధులలో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తిప్పపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మల్లప్ప స్వామి వారి ఆశీనులై పుష్కరణలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు మంగళ వాయిద్యాలు వేద పారాయణం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తిప్పోత్సవమ్ నేత్రపర్వంగా  సాగింది

22, మార్చి 2024, శుక్రవారం

వేడుకగా రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి తెప్పోత్సవం

 తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండో రోజు గురువారం రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి వారు తిప్పలపై భక్తులకు అభయం ఇచ్చారు ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడవీధులలో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తిప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరణలో ముమ్మార్లు వివరిస్తూ భక్తులను కటాక్షించారు వేదంగానం నాదం మధ్య అతిపోత్సవం వేడుకగా జరిగింది మూడోరోజు శ్రీ భూ సమేతంగా మలయప్ప స్వామి వారు తిరుచిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై ముమ్మార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు

24 25 తేదీలలో తుంబూరు తీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ తుంబూరు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24 తేదీలలో ఘనంగా జరగనుంది తీర్థానికి విశేషంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది ఇందులో భాగంగా తుమ్మూరు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు 25వ తేదీ ఉదయం ఐదు నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు పాప వినాశనం వద్ద భక్తులకు అల్పాహారం అన్న ప్రసాదాలు తాగునీరు అందిస్తారు ప్రథమ చికిత్స కేంద్రాలు అంబులెన్స్ మందులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండడంతో గుండే శ్వాస పోష సమస్యలు స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు భక్తులు వంట సామాగ్రి కర్పూరం అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది పోలీసు అటవీశాఖ టిటిడి విభాగం సమన్వయంతో భద్రత చర్యలు చేపట్టనున్నారు