గ్రంధాలయం - ఒక అద్భుతమైన ప్రపంచం
జ్ఞాన పరిమళాలను వెదజల్లే ఒక సుగంధ ప్రపంచం
దుర్వ్యసనాలను దూరం చేసే ఒక ఔషధ ప్రపంచం
విశాల దృక్పథాన్ని పెంచే ఒక విజ్ఞాన ప్రపంచం
షడ్రసోపేత అక్షరాల భోజనాన్ని వడ్డించే ఒక బంగారు కంచం
నిశిరాత్రి వేళ కమ్మటి నిద్రపట్టేలా చేసే ఒక చక్కటి నులక మంచం
మన మనో ప్రపంచాన్ని మధుర అనుభూతులతో నింపే ఒక మరో ప్రపంచం
తప్పకుండా మీరు కెటాయిస్తే గ్రంధాలయానికి రోజూ సమయం కొంచెం
గణుతికెక్కిస్తుంది మిమ్మల్ని తప్పకుండా అబ్బురంగా చూసేలా ఈ సమస్త ప్రపంచం.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
11, మార్చి 2019, సోమవారం
28, జనవరి 2019, సోమవారం
మనది కానిది / పరుల సొమ్ము పాము వంటిది
ఒక రోజు బుద్ధుడు శిష్యులతో కలిసి ఒక పొలం గట్టు మీదుగా వెళ్తున్నాడు.దారిలో ఒక చెట్టు పక్కన ఒక భిక్షువుకి ఒక డబ్బు మూట కనిపించింది.ఆ భిక్షువు - భగవాన్ ఇదిగో ధనం మూట అని చూపించాడు.
" నాయనా, అది ఒక కాలసర్పంలాంటిది.దాని జోలికి వెళ్ళొద్దు,ఇటు వచ్చేయ్ అని వెళ్ళిపోయాడు.మిగిలిన భిక్షువులు ఆ మూటకి కాస్త దూరం జరుగుతూ ఆయన వెంట వెళ్ళిపోయారు.కొద్దిదూరంలో ఉన్న ఒక బాటసారి ఈ తతంగమంతా చూస్తున్నాడు.
వీరికి అక్కడ పామేదో కనిపించినట్లుంది,ఉట్టి పిరికి వాళ్ళలా ఉన్నారు అంతమంది ఉండి కూడా దానిని ఏమీ చేయలేక తప్పుకుని పారిపోతున్నట్లున్నారు అనుకుంటూ అక్కడికి వచాడు.తీరా వచ్చి చూస్తే అక్కడ డబు మూట ఉంది.దాన్ని చేతుల్లోకి తీసుకుని ,వీళ్ళు పిరికివాళ్ళే కాదు,వెర్రిబాగులవాళ్ళలాగా ఉన్నారు,లేకపోతే దీనిని చూసి పాముని చూసినట్లు పరుగులు పెడుతున్నారు.అనుకుంటూ మూటవిప్పి డబ్బు లెక్కపెట్టుకుంటున్నాడు.నిజానికి అసలు జరిగిందేమిటంటే ఆ ముందు రోజు రాత్రి రాజు వద్ద పనిచేసే అధికారి ఇంట్లో దొంగలు పడి చాలా ధనాన్ని దోచుకుపోతూ ,ఈ చెట్టుకింద మూటల్ని లెక్కపెట్టుకున్నారు.చీకట్లో ఒక మూట జారి పక్కన పడిపోయింది. ఇది గమనించకుండా వారు వెళ్ళిపోయారు.తెల్లవారగానే ఆ అధికారి ,దొంగలను వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు ,అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని ధనాన్ని లెక్కపెట్టుకుంటూ కనిపించాడు.ఇతడే ఆ దొంగతనం చేసాడని భావించి అతణ్ణి బాగా తన్ని రాజు గారి దగ్గరకు లాక్కుపోయాడు.ఇదీ కథ.
పరుల సొమ్ము పామువంటిది అనే నానుడి ఇలా పుట్టింది.అందుకే బుద్ధుడు ఇతరులు ఇవ్వకుండా నీకు దొరికింది కూడా నీది కాదు,అదీ ఒకరకంగా దొంగతనమే అని తన శిష్యులకు చెప్పాడు.అంటే నీ శ్రమ కానిది నీది కాదు.మరొకరు దానంగా ఇవ్వనిదేదీ నీది కాదు అని దాని అర్థం
- బుద్ధుని పంచశీల నుంచి -
" నాయనా, అది ఒక కాలసర్పంలాంటిది.దాని జోలికి వెళ్ళొద్దు,ఇటు వచ్చేయ్ అని వెళ్ళిపోయాడు.మిగిలిన భిక్షువులు ఆ మూటకి కాస్త దూరం జరుగుతూ ఆయన వెంట వెళ్ళిపోయారు.కొద్దిదూరంలో ఉన్న ఒక బాటసారి ఈ తతంగమంతా చూస్తున్నాడు.
వీరికి అక్కడ పామేదో కనిపించినట్లుంది,ఉట్టి పిరికి వాళ్ళలా ఉన్నారు అంతమంది ఉండి కూడా దానిని ఏమీ చేయలేక తప్పుకుని పారిపోతున్నట్లున్నారు అనుకుంటూ అక్కడికి వచాడు.తీరా వచ్చి చూస్తే అక్కడ డబు మూట ఉంది.దాన్ని చేతుల్లోకి తీసుకుని ,వీళ్ళు పిరికివాళ్ళే కాదు,వెర్రిబాగులవాళ్ళలాగా ఉన్నారు,లేకపోతే దీనిని చూసి పాముని చూసినట్లు పరుగులు పెడుతున్నారు.అనుకుంటూ మూటవిప్పి డబ్బు లెక్కపెట్టుకుంటున్నాడు.నిజానికి అసలు జరిగిందేమిటంటే ఆ ముందు రోజు రాత్రి రాజు వద్ద పనిచేసే అధికారి ఇంట్లో దొంగలు పడి చాలా ధనాన్ని దోచుకుపోతూ ,ఈ చెట్టుకింద మూటల్ని లెక్కపెట్టుకున్నారు.చీకట్లో ఒక మూట జారి పక్కన పడిపోయింది. ఇది గమనించకుండా వారు వెళ్ళిపోయారు.తెల్లవారగానే ఆ అధికారి ,దొంగలను వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు ,అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని ధనాన్ని లెక్కపెట్టుకుంటూ కనిపించాడు.ఇతడే ఆ దొంగతనం చేసాడని భావించి అతణ్ణి బాగా తన్ని రాజు గారి దగ్గరకు లాక్కుపోయాడు.ఇదీ కథ.
పరుల సొమ్ము పామువంటిది అనే నానుడి ఇలా పుట్టింది.అందుకే బుద్ధుడు ఇతరులు ఇవ్వకుండా నీకు దొరికింది కూడా నీది కాదు,అదీ ఒకరకంగా దొంగతనమే అని తన శిష్యులకు చెప్పాడు.అంటే నీ శ్రమ కానిది నీది కాదు.మరొకరు దానంగా ఇవ్వనిదేదీ నీది కాదు అని దాని అర్థం
- బుద్ధుని పంచశీల నుంచి -
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)