24, మే 2021, సోమవారం

కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు ఎందుకు తీస్తారు?

 కొబ్బరికాయకు పీచు కింది భాగంలో మూడు కళ్ళు ఉంటాయి .ఈ కళ్ళు ఉన్న ప్రదేశం సున్నితంగా ఉంటుంది .అక్కడ గోటితో  గిచ్చిన నీళ్ళు బయటకు వచ్చేస్తాయి .కొబ్బరి పీచు ను పూర్తిగా తీసి నట్లయితే నీళ్లు కారిపోయే అవకాశం ఉంటుంది .అందుకే కళ్ళున్న వైపు పిలకలా పీచును విడిచిపెడతారు .అరటి వంటి పళ్ళను కొద్దిగా వలిచి నివేదన చేస్తారు .భగవంతుడు తినడానికి సిద్ధంగా చేసి ఇవ్వడం అన్నమాట .అందుకే పిలకతో ఉన్నా కొబ్బరికాయను పగలకొట్టి ఆపైన పిలక తీసివేసి నివేదన చేస్తాము.

కొత్త వస్త్రానికి పసుపు ఎందుకు పెడతారు?

 ప్రతి మంచి పని లోనూ పసుపును విరివిగా వినియోగిస్తారు మనవాళ్ళు. శుభకార్యాలలో యజ్ఞ దీక్ష సమయాలలో వస్త్రాలను పసుపు నీళ్లలో ముంచి ఆర వే య డ ము ఆచారం. తడిపి ఆరవేసిన వస్త్రాలు ఇతరులకు ఇవ్వకూడదు .నూతన వస్త్రాలు ఇవ్వాలి. పసుపు నీళ్లతో తడిపితే ఆ వస్త్రాలు పా త వైపోతాయి. అందుకే పసుపు నీళ్లలో తడిపిన ఫలం కోసం ఇతరులకు కొత్తబట్టలు పెట్టేటప్పుడు పసుపు బొట్టు పెడతారు .ఇలా చేయడం మంగళకరంగా భావిస్తారు .పసుపు క్రిమిసంహారిణి .అనేక చేతులు మారి వచ్చే కొత్త బట్టల లో ఎటువంటి క్రిములు ఉన్నా పసుపు నివారిస్తుంది. అప్పటికప్పుడు కట్టుకున్న ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది