24, మే 2023, బుధవారం

బాసర అమ్మవారికి వెండి హంస బహూ కరణ...

 బాసర సరస్వతి అమ్మవారికి జీ ఎం ఆర్ సంస్థ అధిపతులు తయారు చేయించిన 2 కిలోల 800 గ్రాముల వెండి హంస విగ్రహాన్ని ఆలయ ఇ ఓ విజయ రామారావు ,ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి,ల సమక్షంలో ఆలయ అధికారులకు అందించారు.అమ్మవారి సన్నిధిలో వెండి హంసను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.ఆలయ వ్యవస్థాపక వంశీయుడ శరత్ పాటక్, ఏ ఇ ఓ సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





వాసవీ మాతకు ఘనంగా పూజలు

 23-5-2023,జంగం పల్లి,భిక్ నూర్ మండలం.

వాసవీ మాత పీఠం జంగంపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా , భికనుర్ మండలం లోని జంగంప ల్లి గ్రామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక పూజలు నిర్వహించారు. అమ్మ వారి కి ఓడి బియ్యం, కట్న కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా వాసవి మాత చాలీసా ను సామూహిక పారాయణం చేశారు. ఈ కార్య క్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కె.శంకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజు , మాజీ సర్పంచ్ సిద్ధ రాములు, వాసవీ క్లబ్ రీజియన్ చైర్మన్ గందే శ్రీనివాస్,,ప్రతినిధులు కొత్త సిద్ధరాములు,వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.