26, మే 2023, శుక్రవారం

శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట, ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.

 ఎడపల్లి మండల కేంద్రము లో మహాలక్ష్మి మందిరం పక్కన కౌండిన్య గౌడ సంఘం సభ్యులు, దాతల సహకారంతో నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం లో గురువారం25-5-2023 , మల్లారం పిట్ల కృష్ణ మహరాజ్ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మూడు రోజుల పాటు జరిగిన విగ్రహ ప్రతిష్ట వేడుకలలో యాగాలు,పూజలు,నిర్వహించి గురువారం విగ్రహ ప్రతిష్ట చేశారు.భక్తులకు ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ప్రతిష్ట అనంతరం అలంకరించిన అమ్మవారిని భక్తులు దర్శించు కున్నారు.వేడుకల్లో కౌండిన్య గౌడ సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

24, మే 2023, బుధవారం

మాండాపూర్ ఎల్లమ్మ ఆలయం, బిబిపెట్ మండలం.

 

మాందాపూర్ ఎల్లమ్మ ఆలయం లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, ఒడిబియ్యం సమర్పించారు. కుంకుమ పూజలు చేశారు.తీర్థప్రసాదాలు స్వీకరించారు. గౌడ సంఘం సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.