29, మే 2023, సోమవారం

చీనూరు గ్రామం లో శ్రీ ఆంజనేయ స్వామి పునః ప్రతిష్ట.

 నాగిరెడ్డి పేట్ మండల పరిధిలోని చీనూర్ గ్రామంలో తోగిట పీఠాధిపతి శ్రీ మాధవా నంద స్వామి ఆధ్వర్యంలో 28-5-2023 ఆదివారం , ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి మూల విరాట్ పునః ప్రతిష్ట కార్య క్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




26, మే 2023, శుక్రవారం

శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట, ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.

 ఎడపల్లి మండల కేంద్రము లో మహాలక్ష్మి మందిరం పక్కన కౌండిన్య గౌడ సంఘం సభ్యులు, దాతల సహకారంతో నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం లో గురువారం25-5-2023 , మల్లారం పిట్ల కృష్ణ మహరాజ్ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మూడు రోజుల పాటు జరిగిన విగ్రహ ప్రతిష్ట వేడుకలలో యాగాలు,పూజలు,నిర్వహించి గురువారం విగ్రహ ప్రతిష్ట చేశారు.భక్తులకు ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ప్రతిష్ట అనంతరం అలంకరించిన అమ్మవారిని భక్తులు దర్శించు కున్నారు.వేడుకల్లో కౌండిన్య గౌడ సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.