29, మే 2023, సోమవారం

శ్రీ వేణు గోపాలస్వామి ఆలయానికి విరాళం.

 కామారెడ్డి పట్టణంలోని పురాతన వేణు గోపాల స్వామి ఆలయ పునరుద్ధరణ కు ఆదివారం ఆరేపల్లి గ్రామ వాస్తవ్యుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీ తిరుపతి రెడ్డి గారు రూ 5000 విరాళం అంద చేశారు. ఆలయ అభివృద్ధి లో ఆయా వర్గాల వారు భాగస్తులు కావాలని ఆలయ ధర్మ కర్త శ్రీ కంజర్ల మధు పేర్కొన్నారు 

చుక్కా పూర్ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు.

 మాచారెడ్డి మండలం లో నీ చుక్కా పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు ఆదివారం అధిక సంఖ్య లో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ దీపాలతో ప్రదక్షిణలు చేసి  మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టు వెంట్రుకలు, ఓడి బియ్యం, కోర మీసాలు, కానుకలు సమర్పించారు.