యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను సోమవారం ఆలయ అధికారులు లెక్కించార. 25 రోజులుగా హుండీలో భక్తులు సమర్పించిన నగదు బంగారం వెండిని ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపానికి తరలించి లెక్కించారు ఇందులో రెండు కోట్ల 32 లక్షల 22 వేల 689 నగదు రాగా 230 గ్రాముల బంగారం నాలుగు కిలోల 420 గ్రాముల వెండి వచ్చిందని ఈవో రామకృష్ణారావు చెప్పారు అలాగే 593 యూఎస్ డాలర్లు 65 యూఏఈ గ్రహమ్స్ 65 ఆస్ట్రేలియన్ 220 కెనడా 10 సింగపూర్ డాలర్లు 10 ఇంగ్లాండు పౌండ్స్ 122 సౌదీ అరేబియా 400 ఒమన్ రియాల్స్ 15 యూరోస్తోపాటు మరికొన్ని దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో చెప్పారు చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షించారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
30, జనవరి 2024, మంగళవారం
కొండ గట్టు అంజన్న ఆదాయం రెండింతలు
కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది ఆలయ ప్రాంగణంలోని షాపులకు అధికారులు సోమవారం వేలంపాట నిర్వహించగా నిర్వాహకులు పోటీపడ్డారు ప్రధానంగా కొబ్బరికాయల విక్రయం కొబ్బరి చిప్పల సేకరణ టెండర్లకు తీవ్ర పోటీ నెలకొంది గత ఏడాది వేలంపాట ద్వారా రూపాయలు రెండు కోట్ల 64 లక్షల ఆదాయం రాగా ఈసారి మూడు కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది టెండర్ను 45 లక్షలకు దక్కించుకోగా ఈసారి 80 లక్షలకు దక్కించుకున్నారు 94 లక్షలు గా ఉన్న కొబ్బరికాయల షాపు టెండర్ ఈసారి ఒక కోటి 37 లక్షలకు చేరింది వీటితోపాటు కిరాణా పూలు పండ్లు కూల్డ్రింక్స్ హోటళ్లను గతంలో కంటే రెండింతలు పెట్టి దక్కించుకున్నారు వేలంపాటలో అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఈవో వెంకటేష్ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు.

