తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది వెంకటేశ్వర స్వామికి కానుకల రూపంలో వస్తున్న కిలోల కొద్దీ బంగారాన్ని మరో రూపంలో భక్తులకు అందే విధంగా ప్రణాళికను సిద్ధం చేసింది టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి ధరించే మంగళసూత్రాలు తయారు చేయించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది ఈ రకంగా తయారుచేసిన తాళిబొట్లను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభాపేక్ష లేని ధరను నిర్ణయించి విక్రయిస్తారు నాలుగైదు డిజైన్లలో తయారుచేసి ఈ మంగళ సూత్రాలు ఐదు గ్రాములు 10 గ్రాముల బరువుతో ఉంటాయి.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
30, జనవరి 2024, మంగళవారం
నర్సన్న హుండీ ఆదాయం 2.32 కోట్లు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను సోమవారం ఆలయ అధికారులు లెక్కించార. 25 రోజులుగా హుండీలో భక్తులు సమర్పించిన నగదు బంగారం వెండిని ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపానికి తరలించి లెక్కించారు ఇందులో రెండు కోట్ల 32 లక్షల 22 వేల 689 నగదు రాగా 230 గ్రాముల బంగారం నాలుగు కిలోల 420 గ్రాముల వెండి వచ్చిందని ఈవో రామకృష్ణారావు చెప్పారు అలాగే 593 యూఎస్ డాలర్లు 65 యూఏఈ గ్రహమ్స్ 65 ఆస్ట్రేలియన్ 220 కెనడా 10 సింగపూర్ డాలర్లు 10 ఇంగ్లాండు పౌండ్స్ 122 సౌదీ అరేబియా 400 ఒమన్ రియాల్స్ 15 యూరోస్తోపాటు మరికొన్ని దేశాల కరెన్సీ వచ్చిందని ఈవో చెప్పారు చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షించారు.


