30, జనవరి 2024, మంగళవారం

దోమకొండ లో సంకష్టహర చతుర్థి పూజలు

 దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయంలో సోమవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వినాయకుడికి పూలతో అందంగా అలంకరించారు అనంతరం భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం శావతీశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తో పాటు కమిటీ సభ్యులు పూజారి బావి శరత్చంద్ర శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు.

బాసర మీదుగా అయోధ్యకు ప్రత్యేక రైలు

 మహారాష్ట్రలోని జాల్నా జంక్షన్ నుంచి బాసర మీదుగా అయోధ్యకు వచ్చే నెల నాలుగున ప్రత్యేక రైలు నెంబర్ 07.6 49 ను ఏర్పాటు చేశారు ఈ రైలు జాల్న ఫర్గూర్ శైలు పర్భని పూర్ణ నాందేడ్ ముదిఖేడ్ ఉమ్రి బాసర నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల లింగంపేట్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మీదుగా అయోధ్యకు చేరుకుంటుందని బాసర రైల్వే అధికారులు తెలిపారు నాలుగున ఉదయం 9:30 గంటలకు జాల్నా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:15 గంటలకు బాసర మీదుగా మరుసటి రోజు ఎక్కువ జామున 3 35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుందని అన్నారు అలాగే 7న అయోధ్య నుంచి మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11:53 గంటలకు బాసర మీదుగా జాల్న చేరుకుంటుందని తెలిపారు ఈ రైలులో 20 సాధారణ బోగీలు రెండు ప్రత్యేక భోగీలు ఏర్పాటు చేశారు