7, మార్చి 2024, గురువారం

మేడారం జాతర ఆదాయం 13 కోట్ల 25 లక్షలు

 గత జాతర కంటే కోటి రూపాయల 80 లక్షల ధనం 779 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు ముగిసిన హుండీలు లెక్కింపు

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర హుండీల కానుకల ఆదాయం మొట్టమొదటిసారి 13 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటివరకు జరిగిన జాతరలో ఇదే అత్యధిక ఆదాయంగా నమోదయింది 2022 జాతర కంటే మరో కోటి రూపాయల 80 లక్షల ఆదాయం పెరిగింది బంగారం వెండి కానుకలు కూడా పెరిగాయి మొత్తంగా వరంగల్లో వారం పాటు నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారం ముగిసింది ఈసారి జాతరలో 540 ఉండి ఏర్పాటు చేశారు ఫిబ్రవరి 29న లెక్కింపు మొదలుపెట్టగా కరెన్సీ నోట్లు నాణేల రూపంలో 13 కోట్ల 25 లక్షల 225100 వచ్చింది 2022 జాతరలో 517 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 45 లక్షల 34,526 రూపాయలు ఆదాయం వచ్చింది తాజాగా హుండీల ద్వారా 779 గ్రాముల 800 మిల్లి గ్రామంలో బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరాయ్ ఇతర దేశాలకు చెందిన 38 కరెన్సీ నోట్లు రాగా ఇందులో యూఎస్ డాలర్ 20072 కతారి 8 ఆస్ట్రేలియా 6 ఇంగ్లాండ్ 3 సింగపూర్ రెండు నోట్లు వచ్చాయి వీటిని ఫారం ఎక్స్చేంజిలో విలువ కట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో కలవాలని ఉన్నట్లు అధికారులు తెలిపారు ఎండోమెంట్ శాఖా సొంత సిబ్బందితోపాటు మరో రెండు వందల మంది వాలంటీర్ల సహాయంతో వారం రోజుల్లో కౌంటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది దేవాదాయశాఖ అకౌంట్లో ఉన్న మూడు బ్యాంకుల సిబ్బంది కౌంటింగ్ మిషన్లతో భారం పాటు ఇక్కడే డ్యూటీ చేశారు వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు




మహాశివరాత్రికి వేములవాడలో ఏర్పాట్లు

 


మహాశివరాత్రి జాతరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబయింది గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ మహారాష్ట్ర చత్తీస్గఢ్ నుంచి సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాటు చేశారు జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాణ కోసం రాజన్న గుడి చెరువు మైదానంలో స్టేజిని రెడీ చేశారు వేములవాడ జాతర సందర్భంగా రాజరాజేశ్వర స్వామికి ఆటో టిటిడి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు వందలు ఉన్నాయి గురువారం రాత్రి టీటీడీ తరఫున అర్చకులు ఆఫీసర్లు రాజన్నకు పట్ట వస్త్రాలు సమర్పిస్తారు శుక్రవారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు ప్రత్యేకంగా వెయ్యి ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు ప్రత్యేకంగా హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు 1600 మంది పోలీసులు 640 కెమెరాలతో పహార కాస్తున్నారు కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు పూర్తి చేశారు