9, మార్చి 2024, శనివారం

శివుడికి వెండి కిరీటం బహుకరించిన ముస్లిం భక్తుడు

 మహాశివరాత్రి సందర్భంగా ఒక ముస్లిం భక్తుడు మతసామరస్యాన్ని చాటాడు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఎండి మౌలానా పట్టణంలోని శ్రీ భవాని శంకర మహాదేవాలయానికి శుక్రవారం ఆలయ కమిటీ సమక్షంలో 20వేల రూపాయల విలువైన వెండి కిరీటాన్ని బహూకరించారు ఆలయ పూజారి విశ్వనాథ శర్మ ప్రత్యేక పూజలు చేసి కిరీటాన్ని శివలింగానికి అలంకరించారు మౌలానా కుటుంబానికి పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు



మే 10 నుండి కేదార్నాథ్ దర్శనం

 భక్తుల సందర్శనార్థం మే 10 నుంచి కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకొనున్నయని శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది ఉకీ మట్ లోని. ఓంకారేశ్వర ఆలయంలో బి కే టి సి చైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయాన్ని వెల్లడించారు ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ప్రజలు కేదార్నాథ్ దర్శించుకుంటారు శీతాకాలంలో ఈ ఆలయం పూర్తిగా మూసివేస్తారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన అజయ్ గత యాత్ర సీజన్లో రికార్డ్ స్థాయిలో భక్తులు కేదార్నాథ్ సందర్శించినట్లు చెప్పారు ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలిపారు