1, మే 2026, శుక్రవారం

ఘనంగా అష్టోత్తర శతఘటభిషేకం

 మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజున ఆలయంలో మూలమూర్తికి అష్టోత్తర శతఘటభిషేకం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచారణల మధ్య పూజారులు ప్రత్యేక పూజలు చేసి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు. 



స్వామి వారి జన్మదిన పురస్కరించుకొని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఫల పంచామృతాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బాలయ్య ప్రాంగణంలో 108 అష్టోత్తర శతఘటలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండి ఆలయానికి చేరుకుని క్యూ పద్ధతిలో దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో చైర్మన్ కమలాకర్ రెడ్డి పిఓ ప్రభురామచంద్రన్ సిబ్బంది అర్చకులు భక్తులు పాల్గొన్నారు.



కైలాశ్ మానస సరోవర్ యాత్ర 2026

 కైలాష్ మానస సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది. ఈ యాత్ర ఉత్తరాఖండ్లోని లిపులేఖ పాస్, సిక్కిం లోని నాథుల అనే రెండు మార్గాల ద్వారా సాగుతుందని తెలిపింది .లిపులేఖ పాస్, నాథుల నుంచి మొత్తం 20 బృందాలు యాత్రలో పాల్గొంటాయి. ఒక్కో బృందంలో 50 మంది యాత్రికులు ఉంటారు యాత్ర కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు వెబ్సైట్ను kmy.gov.in ప్రారంభించారని తెలిపారు. ఆసక్తిగల యాత్రికులు ఈ నెల 19వ తేదీ లోపు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు.