బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో గురువారం దాతలు పోల విట్టల్ గుప్తా, కుటుంబ సభ్యులు, డాక్టర్ తుకారం దంపతులు , బెజుగం శంకర్ దంపతులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు .ఆలయ అర్చకులు ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలతో స్వామిని అలంకరించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
1, మే 2026, శుక్రవారం
నైవేద్యాలలో ఉల్లి,వెల్లుల్లి ఎందుకు వాడరు..
నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయలు వినియోగం దైవ నివేదనలు ప్రసాదాలలో కనిపించదు. అలాగే పూర్వకాలం నుంచే కొన్ని వర్గాల వారికి వాటిని తమ ఆహారంలో వాటిని వినియోగించకపోవడం ఆచారంగా వస్తోంది .ఆధ్యాత్మిక సాధనకు, ప్రశాంత జీవనానికి సాత్విక ఆహారం ప్రధానమని సాధకులు చెబుతారు .నీరుల్లిని, వెల్లుల్లిని తామస రజోగునాలను పెంచే పదార్థాలుగా పూర్వులు పేర్కొన్నారు. అది కోపాన్ని ,ఆందోళనను, వాంఛలను పెంచుతాయి. కాబట్టి యోగ సాధనకు ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు.
లశునం గృంజనం చైవ పలా0డుం కవకాని చ అభక్ష్యాని ద్విజాతీనాం అమేధ్య ప్రభవాణి చ.. అని మనుస్మృతి చెబుతోంది. లశునం /ఎల్లుల్లి, గుంజనం /ముల్లంగి, పలాండం/ ఉల్లిపాయ, కవకాని /పుట్టగొడుగులు ఇవి అశుద్ధమైన చోట పుడతాయి కాబట్టి ఉపాసకులు శ్రీ విద్యాసాధకులు వాటిని తినకూడదు అని భావము.
ఆధ్యాత్మికపరంగా.. ఆత్మశుద్ధి, సాత్విక జీవనశైలి కోసం ఉల్లిని ,వెల్లుల్లిని నిషిద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సును చంచలం చేస్తాయని చెబుతారు.
ఆయుర్వేదము యోగ శాస్త్రం ప్రకారం.. ఉల్లిపాయలు తామస రజోగుణ ప్రేరేపకమైన పదార్థాలు. అవి శరీరంలో పైత్య రసాన్ని పెంచుతాయి. ఆవేశాన్ని, వాంఛలను రేకెత్తిస్తాయి.
పౌరాణికంగా చూస్తే.. రాహు ,కేతువుల రక్త బిందువుల నుంచి ఉల్లి ,వెల్లుల్లి పుట్టాయంటారు .అందుకే వాటిని అశుద్ధమైనదిగా, రాక్షస ప్రవృత్తి కలిగించేదిగా భావిస్తారు.
దైవానికి నివేదన చేసే విషయానికి వస్తే.. పూజలలో దేవునికి సమర్పించే నైవేద్యములో ఉల్లి, వెల్లుల్లిని అపవిత్రంగా భావించి వినియోగించరు. కాలక్రమైనా మారుతున్న అలవాట్ల వల్ల పూర్వం వీటిని ఉపయోగించని వర్గాలు కూడా స్వీకరిస్తున్నప్పటికీ ,సంప్రదాయ ఆచారాలు పాటించేవారు ఇప్పటికీ దూరంగానే ఉంటారు. అయితే పూజల్లో వినియోగం, సాధకుల నియమాలను పక్కన పెడితే ..నిత్య ఆహార పదార్థాలలో వీటిని వాడే విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు.
