26, ఫిబ్రవరి 2024, సోమవారం

వైభవంగా పెద్దమ్మతల్లి కళ్యాణ జాతర మహోత్సవం

 



పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి కళ్యాణ జాతర మహోత్సవ వేడుకలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జాతర సందర్భంగా అగ్నిగుండాల నిర్వహణ శ్రీ పెద్దమ్మ తల్లి కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవానికి పెంబి మండలమే కాకుండా ఖానాపూర్ కాడ మామడ అలాగ వివిధ జిల్లాల నుండి సైతం భక్తులు పాల్గొని మొక్కలు తెరుచుకున్నారు అలాగే భక్తులు వారి మొక్కలైన కేశఖండనము తులాభారాలను చెల్లించుకున్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూజారులు అర్జన్న, విష్ణు భోజన ముదిరాజ్ యువ సైన్యం సభ్యులు ముదిరాజ్ సంఘం పెద్దలు పాల్గొన్నారు.

నే టి నుంచి శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు

 


కుంటాల మండలంలోని పెంచికల్పాడు గ్రామంలో సోమవారం నుండి ప్రత్యేక వేద పండితులు సంజీవ్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు యొక్క ఉత్సవాల నిర్వహించనున్నట్లు తెలిపారు 28 నాడ విగ్రహాల ఊరేగింపు గణపతి పూజ స్వస్తి పుణ్యాహవాచనము పంచాంగ సంస్కారము రక్షాబంధనము ఆచార్యాది వృత్తికి వరణము ప్రవేశఖండదీప యాగశాల స్థాపన చతుస్వయోగిని సహిత వాస్తు కేంద్ర పాలక సర్వతోభద్ర మండప దేవతా కలశ స్థాపన పూజ అగ్ని ప్రతిష్ట లక్ష్మీ గణపతి ఆలయంతో పాటు స్థాపిత దేవత హవనం సూక్తి ప్రతిష్టంగా నది జలాల ఊరేగింపు పంచామృతంతో జలాధివాసం హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణము 27న ఉదయం 8 గంటలకు కర్మణా పుణ్యవచనం ప్రతిష్ట మూలమంత్ర హోమం స్థాపిత దేవత హవనం సూక్తి హోమము ధాన్యాదివాస కల పుష్ప హోమంలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అంతే కాకుండా కుంకుమార్చన హారతి మంత్రపుష్పం ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు 28న స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూర్ణ హారతి కళాశాల కుంభ సంరక్షణ స్వామి వారి దర్శనము శాంతి కల్యాణము మహా నైవేద్యం హారతి మంత్రపుష్పంతో అటు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకోవాలని గ్రామస్తులు పేర్కొన్నారు