30, జనవరి 2024, మంగళవారం

కొండ గట్టు అంజన్న ఆదాయం రెండింతలు

 కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం భారీగా పెరిగింది ఆలయ ప్రాంగణంలోని షాపులకు అధికారులు సోమవారం వేలంపాట నిర్వహించగా నిర్వాహకులు పోటీపడ్డారు ప్రధానంగా కొబ్బరికాయల విక్రయం కొబ్బరి చిప్పల సేకరణ టెండర్లకు తీవ్ర పోటీ నెలకొంది గత ఏడాది వేలంపాట ద్వారా రూపాయలు రెండు కోట్ల 64 లక్షల ఆదాయం రాగా ఈసారి మూడు కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది టెండర్ను 45 లక్షలకు దక్కించుకోగా ఈసారి 80 లక్షలకు దక్కించుకున్నారు 94 లక్షలు గా ఉన్న కొబ్బరికాయల షాపు టెండర్ ఈసారి ఒక కోటి 37 లక్షలకు చేరింది వీటితోపాటు కిరాణా పూలు పండ్లు కూల్డ్రింక్స్ హోటళ్లను గతంలో కంటే రెండింతలు పెట్టి దక్కించుకున్నారు వేలంపాటలో అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఈవో వెంకటేష్ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ పాల్గొన్నారు.




సిద్ధుల గుట్ట పై ప్రత్యేక పూజలు, అన్నదానం

 ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్దుల గుట్టను సోమవారం భక్తులు సందర్శించుకున్నారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి  పొద్దుటూరి వినయ్ రెడ్డి హాజరై గుట్ట పైన ఉన్న శివాలయం రామాలయం అయ్యప్ప మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవమూర్తులకు రామాలయం నుంచి జీవకోనేరు వరకు పల్లకి సేవ నిర్వహించారు అనంతరం మూల లక్ష్మి ఎర్రన్న ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో నిజాంసాగర్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ ఎలా సాయి రెడ్డి కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ సాయి బాబా గౌడ్ ఫతేపూర్ శ్రావణ్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విఠం జీవన్ పూల నరసయ్య కొంత మురళీధర్ తదితరులు పాల్గొన్నారు