మేడారం జాతర సమీపిస్తున్నందున వేములవాడ రాజన్న క్షేత్రం సోమవారం భక్తజనసంద్రమైనది ఉదయాన్నే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కోడి మొక్కు తీర్చుకొని స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు సాయంత్రం 6 గంటల వరకే సుమారు 80000 కు పైగా భక్తులు దర్శించుకున్నారని వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు 36 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు డిఎస్పి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో పట్టణ సీఐ కరుణాకర్ బందోబస్తును ఏర్పాటు చేశారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
30, జనవరి 2024, మంగళవారం
రాజన్న క్షేత్రం భక్త జన సంద్రం..
శ్రీ వారి బంగారం తో మంగళ సూత్రాలు..
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది వెంకటేశ్వర స్వామికి కానుకల రూపంలో వస్తున్న కిలోల కొద్దీ బంగారాన్ని మరో రూపంలో భక్తులకు అందే విధంగా ప్రణాళికను సిద్ధం చేసింది టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి ధరించే మంగళసూత్రాలు తయారు చేయించాలని ధర్మకర్తల మండలి తీర్మానించింది ఈ రకంగా తయారుచేసిన తాళిబొట్లను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభాపేక్ష లేని ధరను నిర్ణయించి విక్రయిస్తారు నాలుగైదు డిజైన్లలో తయారుచేసి ఈ మంగళ సూత్రాలు ఐదు గ్రాములు 10 గ్రాముల బరువుతో ఉంటాయి.






