1, ఫిబ్రవరి 2024, గురువారం

వీరాంజనేయ స్వామి ఆలయానికి భారీగా విరాళాలు అందజేత

 పిట్లం మండలంలోని పోతిరెడ్డిపల్లి వీరాంజనేయ స్వామి ఆలయ భూదాన నిమిత్తం భారీగా విరాళాలు అందజేసినట్లు ఆలయ అర్చకులు తేజ స్వామి మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంసాగర్ మండల ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి గోర్గల్ మండలంలోని గుర్నాపూర్ సర్పంచ్ ప్రవీణ శ్రీనివాస్ రెడ్డి బంకుల లక్ష్మారెడ్డి కలిపి ఒక్కొక్కరు 5000 రూపాయలు చొప్పున విరాళంగా అందజేశారని తెలిపారు అలాగే తడికల్ మండలం ముక్కునాల సర్పంచ్ ప్రతాపరెడ్డి 5000 రూపాయలు తడకలకు చెందిన గోపాల్ చారి 6000 రూపాయలు విరాళంగా అందజేసినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో ఆయా గ్రామాల హనుమాన్ భక్తులు పాల్గొన్నారు



మేడారంలో సందర్శకులు తాకిడి



ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ మహా జాతర ఫిబ్రవరి 21 నుండి 24 వరకు ఉన్నప్పటికీ ఇప్పటినుండే సందర్శకులు భారీగా వస్తున్నారు మన దేవతలు దర్శనానికి బుధవారం అధిక సంఖ్యలో తరలి రావడంతో మేడారం కిక్కిరిసింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక చత్తీస్గఢ్ నుంచి కూడా భారీగా జనం తరలివచ్చా రోజు లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు కాదా మహా జాతరకు సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంపై దృష్టి సారించారు పనుల్లో నాణ్యతలో రాజీ పడకుండా సకాలంలో పూర్తి చేస్తామని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు