4, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఆధార్ ఉంటేనే ఎత్తు బంగారం

 ఎక్సైజ్ శాఖ నిబంధనలు.. మేడారం సమ్మక్క సారలమ్మ మొక్కులు ప్రధానమైంది ఎత్తు బంగారం బెల్లం ప్రతి జాతర సమయంలో రూ కోట్లలో వ్యాపారం జరుగుతుంది గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ఆ బంగారం కొనుగోలు పై ఎక్సైజ్ అధికారులు కొన్ని నిబంధనలు పెట్టారు వ్యాపారులు భక్తుల నుంచి తప్పనిసరిగా ఆధార్ కార్డు నకలు ఫోన్ నంబరు ఇంటి చిరునామా తీసుకోవాలని నిజంగా మొక్కుకోసమే కొనుగోలు చేస్తున్నారా లేదా అనే వివరాలను సేకరించాలని ఆదేశించారు కొనుగోలు చేసిన వారి పూర్తి వివరాలతో ప్రతిరోజు విక్రయాల రిపోర్టు అందజేయాలని వ్యాపారులకు స్పష్టం చేశారు వ్యాపారులు తమ దుకాణాల ముందు కొనుగోలుదారులు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలంటూ ఫ్లెక్సీలు వంటివి పెట్టారు

వెయ్యి టన్నుల బెల్లం.. రెండేళ్లకోసారి జరిగే జాతరలో భక్తులు మొక్కుగా చెల్లించి ఎత్తు బంగారం సుమారు 1000 టన్నుల వరకు ఉంటుంది గత జాతరలో ఎనిమిది వందల టన్నులు వచ్చినట్లు అంచనా బెల్లం పక్కదారి పట్టకుండా కొనుగోలుదారుల నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలని వ్యాపారులకు చెప్పాను గుడుంబా తయారీకి విక్రయించి నట్లు తెలిస్తే సంబంధిత వ్యాపారులకు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ కిరణ్ నాయక్ తెలిపారు




మఠాలు పీఠాల సూచనలతో సనాతన ధర్మ ప్రచారానికి కృషి

 మఠాధిపతులు పీఠాధిపతులు సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు స్వామీజీల ఆశీస్సులు ఆదేశాలుగా పాటించి ధర్మ ప్రచారానికి పునరంగితమవుతామని పేర్కొన్నారు తిరుమల వాసాన మండపంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు శనివారం ప్రారంభమైంది తొలిరోజు 25 మంది పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు హాజరయ్యారు వారికి టీటీడీ జేఈఈవోలు సదా భార్గవి వీరబ్రహ్మం సి వి ఎస్ ఓ నరసింహ కిషోర్ ఇతర అధికారులు మంగళ వాయిద్యాలు నడుమ స్వాగతం పలికారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ప్రత్యేక పూజలు అనంతరం భూమన ప్రారంభోపన్యాసం చేశారు ఈవో ఏవి ధర్మారెడ్డి సదస్సు ఉద్దేశాలను వివరించారు హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ చేస్తున్న కృషిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు తిరుమల పెద్ద జీయర్ స్వామి చిన్న జీయర్ స్వామి తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులోని వివిధ మతాలు పీఠాలకు చెందిన అధిపతులు అనుగ్రహ భాషణం చేశారు ఆదివారం మరికొందరు ప్రత్యక్షంగా వర్చువల్ గా ప్రసంగించనున్నారు