1, మార్చి 2024, శుక్రవారం

కౌలాస్ మహాన్తేశ్వర మఠం ఉత్తరాధికారిగా నాగేశ్వర్ మన్మధ స్వామి

 జుక్కల్ మండలంలోని కౌలాస్ మహంతేశ్వర మఠం సంస్థాన పీఠానికి ఉత్తరాధికారిగా నాగేశ్వర మన్మధ స్వామి నియామకమయ్యారు గురువారం మఠంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత మఠాధిపతి మల్లికార్జున స్వామి మహారాజా ఆధ్వర్యంలో నూతన ఉత్తరాధికారి నియామకం చేపట్టారు వృషభలింగ శివాచార్య మఠాధిపతి బసవలింగ శివాచార్య మహారాజ్ హానేగా పీఠాధిపతి శంకరాలింగ శివాచార్య మహారాజు కథంగం పీఠాధిపతి మల్లికార్జున శివాచార్య మహారాజ్ గుడిమెట్ మహారాజ్ మహాదేవ స్వామి ఆధ్వర్యంలో ఉత్తరాధికారిగా నియామక ఏర్పాట్లు చేపట్టారు కార్యక్రమంలో కౌలాస్ వీరశైవ లింగాయత్ సమాజ్ నాయకులు వీరేశ్ పటేల్ ప్రకాష్ పటేల్ వినయ్ పటేల్ మల్లికార్జున అప్ప బాబాయ్ అప్ప కాశప్ప గూడ సాయిలు తదితరులు పాల్గొన్నార



మద్నూర్ లో సంతోషిమాత వార్షికోత్సవ వేడుకలు

 ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు సంతోషిమాత వార్షికోత్సవాలు మద్దూర్లో నిర్వహిస్తారు అందులో భాగంగా నేటి శుక్రవారం సంతోషిమాత వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు పూజారి సంతోషి తెలిపారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆలయ ఆవరణంలో గణపతి నవగ్రహాల పూజ కుంకుమ పూజ యజ్ఞం ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు