యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని కళ్యాణమూర్తులకు రెండు బంగారు కిరీటాలు ఒక అభయ హస్తమాభరణాలను హైదరాబాద్కు చెందిన తడకమల్ల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శుక్రవారం అందజేశారు వీటి బరువు 250 గ్రాములు ఉంటుందని పేర్కొన్నారు వారు ముందుగా శ్రీ స్వామిని దర్శించుకుని అనంతరం ముఖ మండపంలో ఈవో రామకృష్ణారావు అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తికి ఆభరణాలను అందజేశారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
1, మార్చి 2024, శుక్రవారం
ఆది శంకరాచార్యులు అక్షరాభ్యాసం చేసింది ఇక్కడే
బడికి వెళ్లబోయే పిల్లలకు ముందుగా సరస్వతి దేవి సమక్షంలో అక్షరాభ్యాసం చేయడం తెలిసింది కానీ ఈ ఆవనం కోడ్ సరస్వతి దేవి ఆలయంలో పిల్లలతో పాటు ఉన్నత విద్యావంతుడు పెద్దపెద్ద అధికారులు సైతం అక్షరాభ్యాసం చేయించుకోవడం విశేషం పరుశురాముడు నిర్మించిన ఈ ఆలయంలోనే జగద్గురు ఆదిశంకరాచార్యులకు అక్షరాభ్యాసం జరిగిందని ప్రతిదీ
అద్వైత వేదాంత సృష్టికర్త అయిన జగద్గురు ఆదిశంకరాచార్యులకు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అక్షరాభ్యాసం జరగలేదంట కొన్నాళ్లకు శంకరాచార్యులు తల్లి ఈ ఆలయానికి తీసుకొచ్చే అమ్మవారి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయించిందని ఐతెహ్యం అలా వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యవ్వనం కోడ్ సరస్వతి దేవాలయం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయించుకునే వారికి చదువుతోపాటు వాక్కును అందించే శక్తి స్వరూపిణిగా సరస్వతి దేవి పూజలు అందుకుంటుంది ఈ ఆలయంలో అమ్మవారితో పాటు జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తిని ఆటంకాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడిని దర్శించుకోవచ్చు.
స్థల పురాణము.. ఒకప్పుడు ఈ ఊరివాళ్లు గడ్డి కోసేందుకు వెళ్లినప్పుడు ఒక రాయికి కొడవలి తగిలి నెత్తురోడిందట సరిగ్గా అప్పుడే పరశురాముడు అక్కడికి వచ్చి ఆశిలలో సరస్వతి దేవి ఉందని గ్రహించి ఆ శిలనే ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడని కథనం అలా పరశురాముడు నిర్మించిన 108 దుర్గాలయాలలో అవనం కోడ్ సరస్వతి దేవి సన్నిధానం కూడా ఒకటి
అక్షరాభ్యాసం రెండు రకాలుగా..
ఈ ఆలయంలో విద్యారంభం విద్యా వాగేశ్వరి పేరుతో రెండు రకాల అక్షరాభ్యాసాలు చేస్తారు చదువును మొదలుపెట్టే పిల్లలకు విద్యారంభాన్ని నిర్వహిస్తే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు విద్యావాహిస్వరి పూజను చేయించుకుంటారు ఒక్క విజయదశమి గ్రంథ పూజగా పిలిచే ప్రత్యేక పర్వదినాలలో తప్ప ఏడాది మొత్తం ఉదయం పూట అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు ఇక్కడ ఆ ప్రక్రియ కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది ఆలయంలోని ప్రధానార్చకుడు అమ్మ వారిని పూజించిన బియ్యాన్ని తీసుకొచ్చి అందులో ఓం హరి శ్రీ గణపతియే నమః అని పిల్లల చేత రాయిస్తాడు. తర్వాత అదే నామాన్ని వాళ్ళ నాలుక పైన రాస్తాడు ఆ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని పిల్లలకే ఇచ్చేసి అమ్మవారిని అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు అక్షరాభ్యాసం చేయించాలి అనుకునేవారు మనీ నరయంగా పిలిచే నాలుక గంట కలం ఆకారాలను దేనికి సకానుకగా సమర్పించడం కనిపిస్తుంది దాని వలన పిల్లలలో వాక్కు వినికిడి శక్తి పెరిగి విద్య వస్తుందని భక్తుల నమ్మకం ఇక విద్యా వాగేశ్వరి పేరుతో నిర్వహించే పూజలు చేయించుకునేందుకు పండితులు రీసర్చ్ స్కాలర్లు పెద్దపెద్ద అధికారులు ఉన్నత విద్య కోసం పోటీ పరీక్షలు రాసేవారు ఆసక్తి చూపిస్తారు ఆ పూజ వల్ల అజ్ఞాన సమపారచనతోపాటు చదువులలో ఏకాగ్రతకుదురుతుందని ఉద్యోగాలలో పదోన్నతి లభిస్తుందని అంటారు ఆలయానికి వచ్చే భక్తులు ఈ ప్రాంగణంలోని ఇసుకలోను అక్షరాలను రాయడానికి చూడవచ్చు
పాస్పోర్ట్ సన్నిధానంగాను..
అవనం కోడ్ సరస్వతి దేవి ఆలయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా నడుం బస్సెరీలో ఉంటుంది ఉన్నత విద్యా లేదా ఉద్యోగాల నిమిత్తము విదేశాలకు వెళ్లేవారు ముందుగా అమ్మవారి సమక్షంలో పాస్పోర్టులను ఉంచి పూజిస్తే ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగడంతో పాటు విజయాలు సొంతమవుతాయని ఉద్దేశంతోనే విమానం ఎక్కే ముందు ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని పాస్పోర్టులకు పూజలు చేయిస్తారు అందుకే ఈ సన్నిధానానికి పాస్పోర్ట్ ఆలయం అని పేరు ఉంది అదే విధంగా కళాకారులు రచయితలు, సైతం తమ పుస్తకాలను సంగీత వాయిద్యాలను అమ్మవారి సమక్షంలో ఉంచి పూజలు చేయిస్తూనే తమకు వచ్చిన విద్యను ఇక్కడ ప్రదర్శించేందుకు ప్రాధాన్యమిస్తారు ఇక స్వయంభూవుగా సాక్షాత్కరించిన అమ్మవారు ఈ ఆలయంలో పడమర వైపు దర్శనమిస్తుంది అమ్మవారితో పాటు దక్షిణామూర్తిని వినాయకుడిని దర్శించుకోవచ్చు సరస్వతి దేవికి ఈరోజు వారే చేసే పూజలతో పాటు ఏడాదికోసారి మార్చి నెలలో పురం పేరుతో పది రోజులపాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరిపిస్తారు


