2, మార్చి 2024, శనివారం

వేములవాడ లో ఏడు నుంచి మహాశివరాత్రి పూజలు

 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈనెల 7 8 9 తేదీలలో నిర్వహించనున్నారు 7న రాత్రి టీటీడీ పట్ట వస్త్రాలు సమర్పిస్తుంది మహాశివరాత్రి రోజు ఎనిమిదిన తెల్లవారుజామున 12 గంటల నుంచి రెండున్నర గంటల వరకు పట్టణ ప్రజలకు సర్వదర్శనం ఉంటుంది తెల్లవారుజామున రెండున్నర గంటలనుండి మూడున్నర గంటల వరకు ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులకు దర్శన అవకాశం కల్పిస్తారు 3:30 నుంచి 3:40 నిమిషాల వరకు మంగళ వాయిద్యాల ప్రదర్శన 3:40 నుండి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ ఆలయ శుద్ధి 4:30 నుండి 6 గంటల వరకు ప్రాతఃకాల పూజ ఉంటుంది ఎనిమిదిన్నర గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శివదీక్ష స్వాములకు దర్శనం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మండపంలో మహా లింగార్చన రాత్రి 11:35కు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తాం



కన్నుల పండుగగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం

 


మద్నూర్ మండల కేంద్రంలోని సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ జరిగింది మూడు రాష్ట్రాల భక్తులు తరలివచ్చారు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ప్రతి ఏడాది మహాశివరాత్రికి ముందు శుక్రవారం ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తారు.

ఆలయ నిర్వాహకురాలు సంతోషి యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి అధ్యక్షుడు కళ్యాణానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు కుంకుమార్చన పూర్తికాగానే యజ్ఞ కార్యక్రమం ప్రారంభించారు సాయంత్రం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కల్యాణానంద స్వామీజీ మాట్లాడుతూ భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయం గొప్పదని ఆలయాలను దర్శించుకుని భక్తులు కోరిన కోర్కెలు తీర్చుకుంటారని గుర్తు చేశారు నీటి యువత పాఠ్యాంశ సంస్కృతిని అవలంబించి భారత సంస్కృతిని మరిచిపోతుందని తల్లితండ్రులు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేయాలని అన్నారు ఆలయాలకు తీసుకెళ్లి ఆలయ విశిష్టతను తెలియజేయాలని గుర్తు చేశారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సంస్కృతి సాంప్రదాయాల విలువలు గుర్తిస్తే వాటిని దూరం చేసుకోవచ్చని తెలిపారు కార్యక్రమానికి కాయ రాష్ట్రాల తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడింది