2, మార్చి 2024, శనివారం

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

 బోధన్ పట్టణంలోని నడివూరు చావిడి వద్ద నూతన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా రెండో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం రెండో రోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. పాడిపంటలు చల్లగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా బోధన్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాగ రెడ్డి మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి మహా సంస్థానం పీఠాధిపతి హాజరుకానున్నారని పేర్కొన్నారు విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు



మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

 


ఆర్మూర్ మండలంలోని చేపూర్లో మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్లను శుక్రవారం ఆర్మూర్ ఎస్హెచ్ఓ రవికుమార్ ఆవిష్కరించారు మహాశివరాత్రిని పురస్కరించుకొని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు ఈనెల ఐదున ఆగు స్వామి మహారాజచే ఆశీర్వాద తీర్థ ప్రసాదాలు 6న కుంకుమార్చన ఏడున గణపతి పూజ పుణ్యాహవాచనము స్వామివారి ఊరేగింపు నగరే డప్పు కళాబృందం వారిచే ప్రదర్శన ఎనిమిదిన శివపార్వతుల కల్యాణోత్సవం 9న అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీడిసి అధ్యక్షుడు రెక్కల గంగారెడ్డి కోశాధికారి దాసరి నాగరాజు తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బద్దం రాజు సురేష్ రుక్మాజి మాజీ ఎంపీటీసీ జల్లేపల్లి గంగాధర్ మాజీ సర్పంచ్ కుస్తాపురం గంగారెడ్డి శ్రీకాంత్ చరణ్ లింగ గౌడ్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు