2, మార్చి 2024, శనివారం

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

 మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలంలో శుక్రవారం బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలిరోజు వేద పండితులు అర్చకులు యాగశాల ప్రవేశం చేసి అంకురార్పణ చేశారు రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ భేరీ పూజ నిర్వహించి సకల దేవతలకు ఆహ్వాన సూచికగా ద్వజపతాకాన్ని ఆవిష్కరించారు శ్రీశైల ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఏడు రోజులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వీరయ్య స్వామి తెలిపారు శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ దేవస్థాన ఈవో ఎస్వి నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి దంపతులు పాల్గొన్నారు స్వామివారు బృంగి వాహన సేవలో దర్శనమిస్తారు స్వామి అమ్మవార్లను అలంకరించి ఆలయ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తారు

రెండు రోజుల మేడారం హుండీల ఆదాయము ఆరు కోట్లకు పైగా

 రెండో రోజు కరెన్సీ కానుకలు రెండు కోట్ల 98 లక్షలు శుక్రవారం తెరిచిన హుండీలు 71 మొత్తం 535 లెక్కించినవి 205

మేడారం మహా జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది రెండో రోజున శుక్రవారం నాటికి ఆదాయం 6 కోట్ల 13 లక్షల 75 వేలకు చేరింది జాతరలో దేవాదాయ శాఖ అధికారులు 535 హుండీలను ఏర్పాటు చేయగా హనుమకొండ టిటిడి కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి మిగతావి తిరుగుబాటు భక్తుల కోసం అక్కడే ఉంచారు గురువారం కౌంటింగ్ ప్రక్రియ మొదలవగా మొదటి రోజు 134 హుండీలలో మూడు కోట్ల 15 లక్షల 40000 ఇండియన్ కరెన్సీ వచ్చింది రెండో రోజున శుక్రవారం మధ్యాహ్నం నాటికి సమ్మక్క తల్లి గద్దె వద్ద ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు పూర్తయింది తర్వాత సార్లమ్మ హుండీలతో కలిపి 71 హుండీలను తెరవగా రెండు కోట్ల 98 లక్షల 35వేల రూపాయల ఆదాయం వచ్చింది మొత్తంగా రెండు రోజుల్లో ఆరు కోట్ల 13 లక్షల 75 వేల రూపాయలు వచ్చిందని అకౌంట్లో జమ చేశామని ఎండోమెంట్ ఆఫీసర్లు పేర్కొన్నారు