5, మార్చి 2024, మంగళవారం

అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం

 లక్ష్మణ చాందా మండలంలోని బాబాపూర్ గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మహాశివరాత్రి ఐదు రోజుల ముందు స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించి నిత్య పూజలు నిర్వహిస్తారు. పేద మంత్రోచ్ఛారణల మధ్య ముత్తైదువల మహిళల నడుమ శివపార్వతుల కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి ఆలయం లోపల జరుగుతున్న స్వామివారి కల్యాణ వేడుకలు బయట ఉన్న భక్తులందరూ తిలకించేందుకు ఆలయ ఆవరణలో ఎల్ఈడి వాల్ స్క్రీన్ ఏర్పాటు చేసి స్వామివారి కల్యాణ వేడుకలను వీక్షించారp అనంతరం రథ గుడి వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి రథోత్సవాన్ని బయటకు తీశారు ఈ వేడుకలను వీక్షించేందుకు బాబాపూర్ నర్సాపూర్ కనకాపూర్ వడ్యాల్ కన్జర్ బోరిగం రాజాపూర్ తదితర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ వేడుకలను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా భారీ భక్తజనం హాజరయ్యారు ఈనెల 8వ తేదీన శివరాత్రి వేడుకలు మూడు రోజులపాటు జాగారం సాగనుంది





76 హుండీల ద్వారా 93 లక్షలు

 కొనసాగుతున్న మేడారం హుండీలో లెక్కింపు ఇప్పటివరకు 481 హుండీలలో 11.25 కోట్ల ఇన్కమ్ చివరి దశకు వచ్చిన లెక్కింపు ప్రక్రియ

మేడారం మహా జాతర హుండీ ఆదాయం 11 కోట్ల 25 లక్షలకు చేరుకుంది ఆదివారం నాటికి 45 హుండీలను లెక్కించగా మొత్తం 10 కోట్ల 32 లక్షల మూడువేల రూపాయలు ఆదాయం వచ్చింది సోమవారం మరో 76 హుండీలను లెక్కించడంతో 93 లక్షల 67000 వచ్చాయి దీంతో ఇప్పటివరకు మొత్తం 481 లెక్కింపు పూర్తిగా 11 కోట్ల 25 లక్షల 70000 ఇన్కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు తిరుగువారం కోసం ఉంచిన 22 హుండీలు సైతం సోమవారం హనుమకొండలోని టీటీడీకి చేరుకున్నాయి మొత్తం ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత మేడారం ఈఓ రాజేంద్రన్ తెలిపారు మేడారం హుండీల లెక్కింపు చివరి దశకు చేరుకుంది మొత్తం 540 ఉండేలా ఏర్పాటు చేయగా ఇంకా 59   హుండీలు లెక్కించాల్సి ఉంది