7, మార్చి 2024, గురువారం

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

 మహాశివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలలో దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ ఆదేశించారు జిల్లా కేంద్రం నీలకంఠేశ్వరాలయంలో బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు ఎండలు పెరుగుతున్న తరుణంలో భక్తుల కోసం చలువ పందిర్లు షామియానాలు మంచినీటి వసతి రక్షణ కోసం పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు ఆయా దేవాలయాల ఈవోలు పూజారులు సిబ్బంది సేవా సంస్థల ప్రతినిధులు పూజలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు ఆమె వెంట ఆ శాఖ పరిశీలకురాలు కమల ఈవో వేణు తదితరులు ఉన్నారు



హజ్ కమిటీ సభ్యులు వేరే

 రాష్ట్ర హస్ కమిటీ సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది ఆరు కేటగిరీలో 15 మంది సభ్యులను ఖరారు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు వీరిలో ఒకరిని గురువారం చైర్మన్గా ఎన్నుకొనున్నారు ఈ ఎన్నిక ఏకగ్రీవంగా లేదా సీల్డ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే అవకాశం ఉంది కేటగిరీల వారీగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మహమ్మద్ షర్ఫుద్దీన్ ఖాజా సాన మహమ్మద్ ముజీబుద్ది ఇలియాస్ అహ్మద్ ఖాస్మి సయ్యద్ ehsanuddin. సయ్యద్ తఖి రజియుద్దిన్, ఫైమిదా బేగం. ,ముహమ్మద్ లయిక్,ముహమ్మద్ యూసఫ్, డాక్టర్ సయ్యద్ అజార్ అలీ మాజీ వర్క్స్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ బియా బానీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్    సయ్యద్ అజ్మతుల్ల హస్సెనీ , హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ లేయాకత్ హుస్సేన్ లను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో బియాబానీ ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.