14, ఫిబ్రవరి 2024, బుధవారం

బీర్కూర్ నుంచి బాసరకు మహాపాదయాత్ర

 వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బీర్కూరు మండల కేంద్రం నుంచి గురుస్వామి సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వందలాదిమంది భక్తులు మహా పుణ్యక్షేత్రమైన బాసరకు మహాపాదయాత్రను చేపట్టారు బీర్కూరు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెద్దహవారి గంగారాం జండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా వసంత పంచమి సందర్భంగా బీర్కూర్ నుంచి చదువుల తల్లి కొలువుదీరిన బాసర వరకు పాదయాత్ర నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తుందన్నారు గత తొమ్మిదేళ్లుగా నిర్విరామంగా పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు బుధవారం బాసరలో అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతామన్నారు పాదయాత్రకు తరలి వెళ్లిన వారిలో లింగం బాలకృష్ణ డాక్టర్ బాలకృష్ణ రాజేందర్ రాజు విట్టల్ గోపాల్ గోపి ఆకాష్ కుమార్ సంతోష్ యోగేష్ తదితరులు ఉన్నారు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి