26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఉజ్జయినిలో ప్రపంచంలోనే తొలి వేద గడియారం

 ప్రపంచంలో తొలి వేద గడియారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 1న వర్చువల్ విధానంలో ఆవిష్కరిస్తారు భారతీయ సంప్రదాయ పంచాంగం ప్రకారం ఇది సమయాన్ని చూపిస్తుంది దీనిని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరం జంతర్మంతర్ వద్ద 85 అడుగుల ఎత్తైన టవర్ పై ఏర్పాటు చేశారు ప్రభుత్వ జీవాజీ అబ్జర్వేటరీ సమీపంలో ఇది ఉంది వైదిక పంచాంగం గ్రహాల స్థితిగతులు ముహూర్తాలు జ్యోతిష్య సూచనలు వంటి వాటిని గడియారం ప్రదర్శిస్తుంది అంతేకాకుండా భారత కాలమానం ఇండియన్ స్టాండర్డ్ టైం గ్రీన్ విచ్ మెయిన్ టైం జిఎంటి ల ప్రకారం కూడా సమయాన్ని చూపిస్తుంది



యాదగిరిగుట్టకు రెండంతస్తుల భవనం విరాళం

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు సుమారు మూడు కోట్ల రూపాయల విలువ చేసే భవనాన్ని విరాళంగా ఇచ్చారు చైతన్యపురికి చెందిన టి శారద హనుమంతరావు దంపతులు 260 గజాల్లో నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని దేవస్థానం పేరిట సోమవారం సరూర్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ దాతలు శారద హనుమంతరావు దంపతులకు ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో భాస్కర శర్మ ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్ ఆలయ అధికారులు సత్యనారాయణ శర్మ ప్రసాదు పాల్గొన్నారు