కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నిలిచిపూరు సరస్వతి ఆలయంలో బుధవారం వసంత పంచమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేపట్టి భక్తులకు ప్రసాదం అన్న ప్రసాద వితరణ చేపట్టారు బాన్సువాడ పట్టణంలోని శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి అర్చకులు సంతోష్ శర్మ విజయ్ శర్మ అమ్మవారికి సుప్రభాత సేవ అభిషేకం అర్చనలు చేపట్టారు భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలతో అమ్మవారిని అలంకరించారు ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి దంపతులు ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం పల్లకి సేవ నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు చేసిన శ్రీ మాత్రే నమః అని నామస్మరణతో పట్టణమంత మారుమోగిపోయింది ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో వినోద్ రెడ్డి ప్రమోద్ రెడ్డి అరుణ్ రెడ్డి బసంత్ మహిళలు భక్తులు తదితరులున్నారు బిబిపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలు పాఠశాలలో బసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు పాఠశాలలో సరస్వతి దేవి పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్లోకాలు పాటించారు కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
ఇకనూరు మండలంలోని ఆయా గ్రామాల్లో అంగన్వాడి సెంటర్లు ప్రైవేటు పాఠశాలలో బుధవారం వసంత పంచంగం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లు ఆయా పాఠశాలలు సరస్వతీ దేవి చిత్రపటానికి అర్చకులు ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం అంగన్వాడి సెంటర్లు ఆయా పాఠశాలల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ మేరకు ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి లింగంపేట మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిరంలో బుధవారం ఘనంగా వసంత పంచ వేడుకలు జరుపుకున్నాడు సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు కొత్తగా 100 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు కార్యక్రమంలో పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షుడు కొత్త దుర్గయ్య పాఠశాల ప్రబంధ గారిని ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోశాధికారి చందు రాజ్ కుమార్లతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు
నెమలి సాయిబాబా ఆలయంలో బుధవారం వసంత పంచమి సందర్భంగా భక్తులు సాయి ఆలయాన్ని చేరుకుని సాయిబాబాను దర్శించుకున్న అనంతరం భక్తులు వసంత పంచమి పురస్కరించుకొని చిన్నారులతో అక్షరాభ్యాసాన్ని చేయించారు సాయి ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు




కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి