మాచారెడ్డి వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేలం పాటలో గదులను దక్కించుకున్న భక్తులు ఉపాధి పొందుతూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ ఉమ్మడి నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ సూచించారు బుధవారం నిర్వహించిన వేలం పాటలు గదులను దక్కించుకున్న తొమ్మిది మందికి ఆ గదిలోకి సంబంధించిన తాళాలను అందజేశారు కిరాయిదారులు 1 నెంబర్ నుండి 10 నెంబర్ గదులకు గాను 3500 11వ గది నుంచి 20వ గది వరకు 3000 రూపాయలు అద్దె నిర్ణయించారు మిగిలిన గదులకు ఈనెల 20వ తేదీ వరకు అవకాశం ఉన్నట్టు ఆమె వెల్లడించారు ఎవరైనా ఆసక్తి ఉన్నవారు దేవాలయంలో సంప్రదించాలని కోరారు కార్యక్రమంలో ఈవో ప్రభు సిబ్బంది లక్ష్మణ్ పోలీసు రెవెన్యూ అధికారులు ఉన్నారు

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి